మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి
11-05-2026 09:24 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వెంకటరావుపేట ఎక్స్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.ఈ తనిఖీల కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






