17 March, 2026 | 4:30 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

బీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు

14-01-2026 07:25 PM

తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ పట్టణ టిఆర్ఎస్ నాయకులు అధ్యక్షుడు సతీష్ చారి మరియు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బిజెపి యువకులు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ పట్టణం నుండి పెద్ద ఎత్తున బిజెపి నుండి యువకులు చేరడాన్ని స్వాగతించారు.

గతంలోని కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఆకర్షితులై చాలామంది బుధవారం బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు పూదరి యాదగిరి గౌడ్, పాల రమేష్ గౌడ్, అహ్మద్, తదితరులున్నారు.