6 March, 2026 | 5:23 PM

పదవ తరగతి ప్రశ్నాపత్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

06-03-2026 01:25 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లను ఆయన తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ నుండి వివిధ పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.