calender_icon.png 28 July, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుడుం మోగించిన ఆదివాసీలు

28-07-2025 02:24:56 PM

జీవో 49 రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

మద్దతు పలికిన ఎమ్మెల్యే హరీష్ బాబు, జెడ్పి మాజీ చైర్మన్ కృష్ణారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు తీసుకువచ్చిన జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని మహా ధర్నాకు తుడుం దెబ్బ పిలుపును ఇవ్వడంతో సోమవారం జిల్లాలోని ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం,బాబా పక్ష నాయకుడు దినకర్ శ్రీనివాస్ మద్దతు పలికారు.

తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు నగేష్, కోట్నాక విజయ్ మాట్లాడుతూ... జిల్లాలోని 339 గ్రామాల ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని దానిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులకు, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోను రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. జీవో రద్దు జరిగితేనే ఆదివాసీల అస్తిత్వానికి మనుగడ ఉంటుందని పేర్కొన్నారు.

ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వివరిస్తున్నాయని ఆరోపించారు.జీవో రద్దు కాకుంటే రాజీనామాలు చేస్తామని ఎమ్మెల్యేలు ప్రకటించడం కాదని తమను రాజీనామాలు చేయమని ఏ రోజు కూడా మేము డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.ఆదివాసీల మనగడ ఉండాలంటే జీవో పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.