calender_icon.png 22 June, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిగా అడ్లూరి బాధ్యతలు

22-06-2025 12:49:38 AM

శుభాకాంక్షలు తెలిపిన భట్టి, శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ శనివారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.

దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహం కల్పించే నిర్ణయంపై ఆయన తొలి సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఫోన్ మిత్రాను మంత్రి పరిశీలించారు. తమ ప్రభు త్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.