22-06-2025 12:50:13 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక పురోగతి, ప్రగతిని చూపించిన రాష్ర్టం తెలంగాణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అహింసాయుతంగా జరిగిన ఒక మహాఅద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమమని, తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే చెప్పుకొంటే సరిపోదన్నారు.
ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవడంతో పాటు లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసానిచ్చిన విజయగాథలా తెలంగాణను చూ డాలని కేటీఆర్ స్పష్టం చేశారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్, శనివారం లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఆక్స్ఫర్డ్ ఇం డియా ఫోరం సదస్సులో పాల్గొని మాట్లాడారు. సబ్బండవర్గాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలా తెలంగాణ విజయాన్ని చెప్పుకోవాలని పేర్కొన్నారు.
2015 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం నాలుగేండ్ల స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. అమెరికాను మినహాస్తే హైదరాబాద్లోనే అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ కూడా ఉందన్నారు. ప్రపంచంలోని మూడో వంతు వ్యా క్సిన్ ఉత్పత్తి తెలంగాణలో జరుగుతోందని, ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లోనే తమ క్యాంపస్లను ఏర్పాటు చేశాయన్నారు.
ఐటీ రంగ ఉద్యోగ కల్పనలో వరుసగా రెండేండ్ల పాటు బెంగళూరును హైదరాబాద్ దాటిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అనుమతులకు ఎన్నో రోజులు పట్టేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా వ్యవస్థను రూపొందించామన్నారు. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ ఇలాంటి అవకాశం లేదన్నారు.
70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.75 వేల కోట్లు జమచేసిన రాష్ర్టం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. తాము తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని, అందుకే 2014లో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ, పంజాబ్, హర్యానాలను దాటి 2022 నాటికి నెంబర్వన్కు చేరిందని కేటీఆర్ తెలిపారు.
బటర్ ఫ్లు ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్టే, కేసీఆర్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పుకోవాలని, ప్రజల జీవితాలను మా ర్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందనేది అనడానికి తెలంగాణ విజయగాథే నిదర్శనమన్నారు. కోటి ఇండ్లకు శుద్ధి చేసిన తాగునీటిని అందించిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని, 80 మీటర్ల సముద్ర మ ట్టం నుంచి 618 మీటర్లకు నీటిని తీసుకెళ్లే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారన్నారు.
ఇన్ లాండ్ ఫిషరీస్లో తెలంగాణ నెంబర్వన్గా ఉందన్నారు. తమ హ యాంలో ఫ్లోరోసిస్ను పూర్తిగా నిర్మూలించామ ని, హైదరాబాద్ లాంటి నగరానికి నీటి సమస్య లు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపించామ ని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు అద్భుతమైన భ విష్యత్తు ఉందన్న తాను బలంగా నమ్ముతున్నానని, ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు అన్నారు. తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.