calender_icon.png 7 June, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల కళాశాలలో నేరుగా అడ్మిషన్లు

06-06-2025 06:22:53 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల(Kesamudram Tribal Welfare Girls' Gurukul) జూనియర్ కళాశాలలో హెచ్ఈసి, సీఈసీ కోర్సుల్లో ప్రధమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను నేరుగా భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. సీఈసీలో 21 సీట్లు ఖాళీగా ఉండగా, 15 ఎస్టి, బీసీ 1, ఓసి 1, ఆర్ఫన్1, స్పోర్ట్స్ 1 పీహెచ్సీ 1 సీటు ఖాళీగా ఉన్నాయని, అలాగే హెచ్ఈసిలో 29 సీట్లు ఖాళీగా ఉండగా, ఎస్టీ 24, ఎస్సీ 1, ఓసి1, పిహెచ్సి1, స్పోర్ట్స్, 1 ఆర్ఫన్ 1 ఖాళీగా ఉన్నాయి. ఆయా కేటగిరీలకు చెందిన విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కళాశాలలో చేరదలచిన విద్యార్థులు ఈనెల 10 తేది లోపు ఎస్ఎస్సి  మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, మీసేవ ద్వారా పొందిన కులం, నివాసం, ఆదాయం ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, రెండు సెట్ల జిరాక్స్ లు, ఆధార్ కార్డు, నాలుగు పాస్ ఫోటో లు వెంట తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.