calender_icon.png 7 June, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిబాటను విజయవంతం చేద్దాం

06-06-2025 06:10:10 PM

బైంసా(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి బడిబాటను విజయవంతం చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చారు. మండలంలోని మహాగాం గ్రామం పాఠశాల ఆవరణలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే పాఠ్య పుస్తకాలను నోటు పుస్తకాలను అందించడంతోపాటు మధ్యాహ్న భోజనం ఇస్తుందన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ఈ నేపథ్యంలో విద్యార్థులకు అన్ని విధాల నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు అనవసరమైన అపోహలతో అధిక ఫీజులను భరిస్తూ ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించి ఇబ్బంది పడవద్దని ఇతవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపాధ్యాయులు పోషకులు పాల్గొన్నారు.