16 March, 2026 | 9:09 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఏఈ లంచం రూ.1.20 లక్షలు

18-06-2025 12:24 AM
  1. ఏసీబీకి చిక్కిన చర్లపల్లి డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ 
  2. రూ.28 లక్షల బిల్లుకు రూ.2 లక్షలు డిమాండ్

ఘట్‌కేసర్, జూన్ 17: జీహెచ్‌ఎంసీ కా ప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ -ఎలక్ట్రికల్) రూ.1.20 లక్షలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఓ కాంట్రాక్టర్ ఏఈ స్వరూపను కోరారు. రూ.28 లక్ష ల బిల్లు చెల్లించేందుకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్‌పై ఏఈ ఒత్తి డి తీసుకొచ్చారు.

దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ యూనిట్ ఆధ్వర్యంలో పతకం ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా కాంట్రాక్టర్లను లంచాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి. ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.