18-06-2025 12:24:59 AM
భద్రాచలం, జూన్ 17 (విజయ క్రాంతి); భద్రాచలం పట్టణం గోదావరి ముంపుకు గురి కాకుండా రూ 38 కోట్లతో సుభాష్ నగర్ కాలనీ వైపు నిర్మిస్తున్న కరకట్టను త్వరితగతిన పూర్తి చేయాలని, గోదావరి ముంపు నుండి భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ లు డిమాండ్ చేశారు.
నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను సిపిఎం బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన కరకట్టను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ కరకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు జిల్లాలోని ముగ్గురు మంత్రులు కరకట్టను త్వరితగతిన పూర్తి చేస్తామని భద్రాచలం ముంపు నుండి రక్షిస్తామని హామీలు గు ప్పించి ఆ మాటే మరిచారన్నారనీ విమర్శించారు.
మంత్రులకు కరకట్ట నిర్మాణం పట్ల చిత్తశుద్ధి ఉంటే వర్షాకాలం వచ్చే లోపు కరకట్ట పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి జరిగే నష్టానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. గో దావరి ఫ్లడ్ మాన్యువల్ ను మార్పు చేయాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కరకట్టను పూ ర్తి చేసి పాత కరకట్టకు నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దశల వారి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సర్వే బృందంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి జిల్లా హెచ్ కమిటీ సభ్యులు సున్నం గంగా, బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్ అజయ్ కుమార్ ధనకొండ రాఘవయ్య కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.