11-06-2025 10:28:15 PM
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన రుణ సహాయం అందించి ఆర్థికంగా అండగా నిలవాలని బ్యాంక్ అధికారులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్(National SC Commission member Hussain Naik) ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకును ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు గిరిజనులకు ఇబ్బందులు కలిగించకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. బ్యాంకు అధికారులు సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.