calender_icon.png 15 June, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రతిభకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే

11-06-2025 10:26:30 PM

కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్..

పెన్ పహాడ్: విద్యార్థుల ప్రతిభకు మార్గదర్శకులుగా.. భవిష్యత్తుకు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఉపాధ్యాయులే కీలకపాత్రని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్(District Collector Tejas Nandalal Power) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 'బడిబాట- అవార్డుల ప్రధానోత్సవం ' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలో మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మేమెంటో ప్రశంసా పత్రాలతో  అభినందించారు.

అంతేకాకుండా మండల స్థాయిలో బోధన నైపుణ్యం, క్రీడల్లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన జిల్లా పరిషత్ పెన్ పహాడ్, అన్నారం sc కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ నకిరేకంటి రవి,  రాచూరి కృష్ణయ్య, సహోపాధ్యాయులు నవీన్ తో పాటు పదిలో అత్యుత్తమ మార్కుల సాధించిన విద్యార్థిని జి.  సింధును ఆమె తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ఘన సన్మానం చేశారు.

అలాగే మండలంలోని ఆయా పాఠశాలలో మెరుగైన సులభతరమైన బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణకు ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఎంఈఓ నకిరేకంటి రవిని కలెక్టర్ ప్రత్యేక ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులలో క్రమశిక్షణ..నిజాయితీ.. శ్రమ ఉన్నప్పుడే విద్యార్థుల్లో ఎదుగుదల ఉంటుందని అంతేకాకుండా ఈ పోటీ విద్యా ప్రపంచంలో  ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు విధిగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని ఆయన కోరారు. అప్పుడే విద్యార్థులలోనే కాదు ఉపాధ్యాయులు అనుకున్న లక్ష్యం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్ తదితరులు ఉన్నారు.