12 March, 2026 | 6:09 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అయ్యారే దండారీ.. అదిరెన్ ‘గుస్సాడీ’!

02-11-2024 02:41 AM

ఆదిలాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా ఆదివాసీలు నియమనిష్ఠలతో దండారీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడెంలో ఘనంగా దండారీ ఉత్సవాలు జరిగాయి. కలెక్టర్ రాజరి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్లు దీపక్ తివారీ, అజ్మీరా సంకేత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు.

ఆదివాసీలతో కలిసి కోలాటమాడుతూ సందడి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఇదే రూరల్ మండలం అంకాపూర్, చిన్న మాలే బోరిగం గ్రామాల్లో జరిగిన ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి వారు గుస్సాడీ నృత్యం చేశారు.