23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

అలయ్ బలయ్‌ను విజయవంతం చేయాలి

09-09-2025 01:00 AM

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..

ముషీరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన అలయ్ బలయ్ -2025  కార్యక్రమాన్ని అన్ని వర్గాలవారు హాజరై విజయవంతం చేయాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం  హైదరాబాద్ రామ్‌నగర్‌లో అలై బలాయ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి  అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.

ఆయన మాట్లాడుతూ   అక్టోబరు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 20వ సంవత్స రం అలయ్ బలై జరుపుకోవాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి,  ప్రేంసింగ్ రాథోడ్,  మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్, ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్, బి. శ్యాంసుందర్ గౌడ్,  బాల్ద అశోక్, సీనియర్ జర్నలిస్ట్ బాల్ద అశోక్,  కార్పొరేటర్ కొంతం దీపిక, హైదరాబాద్ సెంట్రల్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఇ. అజయ్  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.