18 March, 2026 | 12:08 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

కాంగ్రెస్‌కు మిగిలింది గాడిదగుడ్డే

09-02-2025 01:35 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డే మిగిలిందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీ ఫలితాలపై శనివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ.. ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్‌రెడ్డి పాత్ర అమోఘమన్నారు.

ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచా రం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని, ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగంగా నిర్వహించిన కులగణన మీకే బెడిసికొట్టిందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మళ్లీ కులగణన నిర్వహించి, అన్నీ కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు.

లేదంటే ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతమవుతా యని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలనూ కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని జోష్యం చెప్పారు.