కూకట్పల్లిలో నవదంపతుల ఆత్మహత్య
02-05-2026 01:28 PM
హైదరాబాద్: కూకట్పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లిలో నవ దంపతులు(Newlywed couple) ఆత్మహత్య చేసుకున్నారు. భర్త కార్తీక్ ఉరివేసుకుని, భార్య మంజుల విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






