15 March, 2026 | 6:02 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి

25-09-2024 12:29 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంబీఏలో 90.8 శాతం, ఎంసీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తంగా 90.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కలిపి 285 కాలేజీల్లో 35,311 సీట్లలో 31,842 సీట్లు భర్తీ కాగా, 3,469 సీట్లు ఇంకా మిగిలాయి. 99 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈనెల 27లోపు విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.