15 March, 2026 | 7:35 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

25-09-2024 12:33 AM

ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీవో, టీఎన్జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫోర్త్ క్లాస్‌తో కలిపి మొత్తం 205  సంఘాలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, అన్ని బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను ప్రకటించి దాన్ని అమలు చేయాలని విన్నవించారు.