4 May, 2026 | 3:05 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్

24-12-2024 11:45 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారిస్తున్నారు. సంధ్య థియేటర్ కేసులో నిన్న పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇంటి నుంచి ఒకే కారులో చిక్కడపల్లి పీఎస్ కు వచ్చారు. వారి వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన వాహనాల రాకపోకలను నిలిపివేసి పోలీసు స్టేషన్ కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు.