5 May, 2026 | 7:03 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

అథ్లెట్లకు అండగా..

22-07-2024 12:05 AM

ఐవోఏకు బీసీసీఐ 8.5 కోట్లు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముం దు.. మన అథ్లెట్లకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మద్దతుగా నిలిచింది. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం బీసీసీఐ ఆదివారం భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) రూ. 8.5 కోట్లు అందజేసింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ జై షా వివరాలు వెల్లడించాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు బీసీసీఐ అండగా ఉంటుంది. అందుకోసం ఐవోఏకు ఎనిమిదిన్నర కోట్లు అందిస్తున్నాం’ అని జై షా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ నెల 26 నుంచి విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.