30 June, 2026 | 8:40 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఖేల్‌కి జోష్

22-01-2026 12:05 AM

కొత్తపల్లి, జనవరి 21(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణం లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ‘అల్ఫోర్స్ ఖేల్ కి మస్త్‘ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఎన్నో లాభాలు చేకూర్చడమే కాకుండా వారికి చ దువు పట్ల ఆసక్తిని పెంపొందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.

మన భారత దేశంలో క్రీడా రంగానికి ఎనలేని ప్రాముఖ్యత ఉన్నదని మరియు చాలామంది క్రీడారంగంలో రాణించడం ద్వారా విజేతలగా ఉన్నారని అన్నారు.వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఫుట్ బాల్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డి, స్కిప్పింగ్, చెస్, క్యారమ్స్ మరియు తదితర పోటీలను ని ర్వహించడం జరిగింది.అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులను త్వరలో నిర్వహించే ప్రత్యేక వేడుకలో ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.