19 March, 2026 | 12:44 AM

తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి

18-03-2026 09:32 PM

ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలంలో మహిళా సంఘాల రుణాల రికవరీ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దోమకొండ కుమార స్వామి వీఓ, మంధర సంఘంలో లావణ్య సభ్యురాలి నుండి రూ.1 లక్ష స్త్రీనిధి రుణాన్ని రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ... మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు.

ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రుణాలను ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించి, వాయిదాలను సమయానికి చెల్లించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం, సీసీలు, వీఓఏ అధ్యక్షురాలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.