పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వెంకటాపూర్, జూన్ 7 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రామప్పలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజులలో జరిగిన మధుర సంఘటనలు, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధం, స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన సహచరులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని తిరిగి గుర్తు చేసే వేదికలుగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమావేశాలు విద్యార్థుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకునేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని వారు తెలిపారు.






