calender_icon.png 27 July, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీపేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

27-07-2025 07:12:13 PM

25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు..

సన్మానించి అభినందించిన పూర్వ విద్యార్థులు..

దోమకొండ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల, నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం బీబీపేట పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2000 విద్య సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాశీనాథ్ శర్మ, మాధవ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, సుతారి అంజయ్య, తుమ్మ రామచంద్రం, ఎదుల్ల ఇంద్రసేనా రెడ్డి, కిష్ట రెడ్డి, ఆనందరావు, విశ్వమోహన్, ఎల్లము, రమేష్ శర్మలు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఉపాధ్యాయులకు ఎనలేని ఆనందం కలుగుతుందని, కష్టాలకు కృంగిపోకూడదని జీవిత లక్ష్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకూడదని పూర్వ విద్యార్థులకు సూచించారు. సమాజ శ్రేయస్సుకు సాధ్యమైనంత వరకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల క్రితం పాఠశాలలో పొందిన అనుభవాలను పంచుకుని ఆనందంతో గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.