09-06-2025 12:37:50 AM
రామగిరి జూన్ 8 (విజయ క్రాంతి) రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలోని శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యా భారతి కరస్పాండెంట్ కేశెట్టి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ తో పాటు పూర్వ విద్యార్థిని విద్యార్థులు (1999-2000) సంవత్సరం చెందిన విద్యార్థులు పాల్గొని చిన్ననాటి గుర్తులను గుర్తు చేసుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులుకొట్టే రాజేందర్, పూరెల్ల రాజేందర్, మంద ప్రభాకర్ కన్నూరి సంపత్, బొబ్బిలి మోహన్, కాట స్వప్న, పాత మాధవి, బొడిగ రజిత, చిట్టెంపెల్లి శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.