calender_icon.png 9 June, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతాం

09-06-2025 12:38:22 AM

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

వరంగల్, జూన్ 8 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు ఇచ్చి తీరుతామని, విడతల వారీగా అందరికీ గూడు కల్పిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నిలువ నీడలేని పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.

ఆదివారం నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు, పరకాల పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవచ్చని , ఇందుకోసం ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.