08-06-2025 10:44:27 PM
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) చిన్నకోడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 పదవ తరగతి విద్యార్థులు 30వ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్యతో పాటు రిటైర్డ్ ఉపాధ్యాయులైన జగ్గారెడ్డి, చంద్రారెడ్డి, రాములు, సుందరయ్యలు పాల్గొని మాట్లాడారు. నాటి పరిస్థితులను జీవన విధానాలను గుర్తు చేస్తూ నేటి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ఆరోగ్యపరమైన సామాజికపరమైన సలహాలు సూచనలు చేశారు.
ప్రతి విద్యార్థి వివిధ రకాల ఉద్యోగాలు, వ్యవసాయం చేస్తుండటంతో వారి జీవితాల్లో స్థిరపడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిల్లల పెంపకం విషయంలో, చదివించటంలో జాగ్రత్తలు తీసుకోవాలని... నేటి యువతరానికి స్ఫూర్తిని ఇచ్చే విధంగా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. ఈకార్యక్రమంలో జాలపల్లి మల్లారెడ్డి, గోవిందారం శ్రీనివాస్, మాడూరి రాజు, కర్నే రామకృష్ణారెడ్డి, దొంతుల నర్సింగారావు, బాసంగారి శ్రీనివాస్, కర్న శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల ఎల్లం, మాతంగి రంగరాజు, గాజుల రవి తదితరులు పాల్గొన్నారు.