08-06-2025 10:47:21 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఓ యువకుడు డబ్బులు సంపాదించాలని కక్కుర్తితో ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్క(Cannabis plant)లను పెంచి కటకటాల పాలైన సంఘటనిధి. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు అతని ఇంటిని సోదా చేసి 8 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి తాళ్లగురజాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చంద్రవల్లి గ్రామానికి చెందిన కోట్రంగి పోచన్న తన ఇంటి ఆవరణలో కొంతకాలంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.
సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆయన ఇంటిని సోదా చేశారు. ఇంటి ఆవరణలోని పెరట్లో 8 గంజాయి మొక్కలు పోలీసులకు దొరికాయి. తానే గంజాయి మొక్కలను పెంచి విక్రయిస్తూ తద్వారా ఆదాయాన్ని పొందాలని మొక్కల పెంపకం చేపట్టాడు. గత రెండు నెలల క్రితం విత్తనాలను నాటగా అవి పెరిగి పెద్దవయ్యాయి. అమ్ముకునే క్రమంలోనే పోలీసులు అనూహ్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల్ని సీజ్ చేసి అతని పై కేసు నమోదు చేసుకుని కోర్టు లో ప్రొడ్యూస్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.