20 June, 2026 | 6:42 PM

Breaking News

నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •  

దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 04:06 PM

ఇల్లందు,(విజయక్రాంతి): తెలంగాణ ఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేకల శ్యామ్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ మాదిగ, బొప్పి భాగ్య పాల్గొని మాట్లాడుతూ... అంబేద్కర్ దళితుల హక్కుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాళ్ల శివ మాదిగ, బోశాల దుర్గారావు, గుండెపాక కిరణ్, మెంతన ప్రకాష్, ఆలూరి వేణుగోపాల్, నేలమర్రి నాగరాజు, మేకల ప్రసాద్, సంపత్, సాగర్, కార్తీక్, అప్పారావు, నవతేజ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.