27 August, 2026 | 1:52 AM

సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

20-06-2026 06:06 PM

గ్రామాల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలి వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని  విద్యాశాఖలోని ఆశ్రమ పాఠశాలలు, ఎకో ఉపాధ్యాయ పాఠశాలలో  విధులు నిర్వహిస్తున్న  సిఆర్టిల సమస్యలను  పరిష్కరించుటకు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆమె ఇచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CRT లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత CRT ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తగిన చర్యలు చేపడతాం అన్నారు.గ్రామాల్లోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలను గ్రామాల్లో తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.