17-06-2025 01:31:21 AM
బాన్సువాడ, జూన్ 16 (విజయ క్రాంతి) హైదరాబాద్ సోమాజిగూడ లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రివర్యులుగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకట్ స్వామి నియామకమైన సందర్భంగా సోమవారం హైదరాబాదులో కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ సంఘం, మాల మానాడు సంఘం ప్రతినిధులు కలిసి షాలువతో, జ్ఞాపికతో సన్మానించారు.
ఫోటో ఫ్రేమ్ ని జ్ఞాపికగా ఇచ్చిన జాతీయ మాల మహానాడుఅధ్యక్షులు జి చెన్నయ్య, కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, బాన్స్ వాడ డివిజన్ అంబేద్కర్ సంగం ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు, బోర్లం మాలమహానాడు అధ్యక్షులు డాక్టర్ బేగరి సాయిలు, సంఘ సభ్యులు మన్నె సురేష్ ,బోర్లం మాలమహానాడు కా్య్సియర్ పోతురాజు సాయిలు, ఆధ్వర్యంలో బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాన్సువాడ అంబేద్కర్ సంఘం మాల మాల నాయకులు అభినందించారు.