17-06-2025 01:29:54 AM
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్యకు మొరపెట్టుకున్న జేజే డెవలపర్స్ బాధితులు
నిజామాబాద్ జూన్ 16 (విజయ క్రాంతి): స్థిరాస్తి వ్యాపారుల మోసానికి బలైన బాధితులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపి సాయి చైతన్యను సోమవారం కలిసి తమకు న్యాయం చేయవలసిందిగా మొరపెట్టుకున్నారు.
జె జె డెవలపర్స్ ఇందూర్ అవని వెంచర్స్ భూ యజమానులు ఫైనాన్సర్ కుమ్మక్కై కుట్రతో తమకు ప్లాట్లు చేసి అమ్మి అరవై కోట్లకు పైగా విలువ గల భూమిలో ముందుగా ప్లాట్ లో నంబర్ వేసి అప్పగించినపోటీకి నీ సదరు స్థిరాస్తి వ్యాపారులు తమ ప్లాట్ల లోకి వెళితే తరిమి వేస్తున్నారని తమ ప్లాట్లు తమకు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతు న్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ జే జే డెవలపర్స్ బాధితులు ఈరోజు జిల్లా కలెక్టర్ , పోలీస్ శాఖ కమిషనర్ సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేశారు.
తమను మోసానికి గురిచేసిన జేజే డెవలపర్స్ భూ యజమానులు ఫైనాన్షియస్ లపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేసి తమ ప్లాట్లను ఇప్పించాల్సిందిగా జిల్లా అధికారులను బాధితులు మొరపెట్టుకుంటున్నారు.