calender_icon.png 1 July, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమరారంలో సబ్ మార్కెట్ యార్డ్ నిర్మించాలని ఏఎంసి చైర్మెన్ కలెక్టర్ కి వినతి..

30-06-2025 07:20:05 PM

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మించతలపెట్టిన నూతన సబ్ యార్డ్ నిర్మాణం కొరకు రెవిన్యూ భూమి లేకపోవడంతో ఫారెస్ట్ భూమిలో నిర్మించేందుకు అవకాశం కల్పించాలని ఇల్లందు వ్యవసాయ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు(Agriculture Committee Chairman Banoth Rambabu) కోరారు. కొమరారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V Patil)కు ఆయన వినతి పత్రం అందజేశారు. కొందరు రైతులు పోడు భూములు పట్టా క్లైమ్ నెంబర్ ఉన్నప్పటికి వారి భూములలో అటవి అధికారులు గుంతల తవ్వడంపై విచారణ జరిపి వారి భూములు వారికి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాము, తిలక్ నగర్ మాజీ ఎంపిటిసి పూనెం సురేందర్, మండల నాయకులు చెన్నూరి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.