04-06-2025 01:27:15 AM
ఆమె వ్యాఖ్యలను సమాజం సరిగా అర్థం చేసుకోవాలంటూ అధ్యాపకుల లేఖ
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ గురుకులాలు కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి మే 31న నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయం స్పష్టం చేశారు.
‘విద్యార్థులతో పనులు చేయించడంలేదు.. కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని, నా మాటలు ఎడి టింగ్ చేసి చూపించా రు. రెండు గంటల ఆడియోని నాలుగు నిమిషాలు ఎడిట్ చేసి లేనిది ఉన్నట్లు ప్రచారం చేశారు. నేను ఒక బీసీ బిడ్డను.. వ్యవసాయ కుటుం బం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న’ అంటూ వరించారు.
టాయిలెట్లు వాడుకున్న తర్వాత.. నీళ్లు పోయమన్నారంతే!
గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి వ్యాఖ్యలను సమాజం సరిగా అర్థంచేసుకోవాలటూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తూ ఈనెల 2న లేఖ రాసింది. దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అందు లో వివరించింది. వందలాది మంది విద్యార్థులుండే గురుకుల పాఠశాల ల్లో పరి స్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవ చ్చు.
మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించుకున్న వాళ్లు వెంటనే నీళ్లు పోస్తే తర్వాత వాటిని ఉపయోగించుకునే వాళ్లకు ఇబ్బంది ఉండదనే కోణంలో సొసై టీ కార్యదర్శి మాట్లాడారేగానీ, స్వీపింగ్ అం డ్ శానిటేషన్ టెండర్లు రద్దు చేసి విద్యార్థుల ను టాయిలెట్లు కడగమని కాదనే విషయా న్ని గమనించాలని లేఖలో అధ్యాపకులు తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవద్దని లేఖలో పేర్కొన్నారు.