calender_icon.png 5 June, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీల వైకుంఠపాళి

04-06-2025 01:32:08 AM

* బీజేపీ కూడా తమ రాజకీయ వ్యూహాలకు పదనుపెడుతోంది. రాబోయే ఆర్నెల్ల లోపు కొత్త అధ్యక్షు డిని పార్టీ నియమించబోతోంది. అప్పుడు రాష్ట్ర రాజకీయ రంగంపై కమలం పార్టీ ఊ పు కనిపించవచ్చు. రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ప్రధానమ్రంతి మోదీ, హిందూత్వ, దేశంలో బీసీల సంఖ్యను పెం చేందుకు జనగణనలో కులగణన చేపట్టే అం శం అభివృద్ధి, ఆపరేషన్ సిందూర్‌తో సాధించిన విజయం ఆ పార్టీకి కలిసివచ్చేవిగా ఉన్నాయి. 

* కేసీఆర్‌కు ఎన్నికల ముందు ఎదురుదెబ్బలు తగలడంతో అప్పు డు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి కలిసివచ్చింది. ప్రతికూల పరిస్థితులను దాటుకొని ఎన్నికల్లో  ఆయన ప్రజల్లోకి దూకుడుగా వెళ్లారు. అప్పుడు కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులకన్నా కేసీఆర్ తప్పిదాలే లాభం చేకూ ర్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ తన వైపుకు తిప్పుకున్నది. దీనితో పాటు వామపక్షాల్లో ప్రధానమైన సీపీఐ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. దీనితో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 

పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన రాష్ట్ర రాజకీయ యవనికపై ప్రజలకు అనేక ఎత్తుపల్లాలను చవిచూపిం చాయి. తెలంగాణలో తనకు ఇక తిరుగులేదని భావించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చివేసి ఇతర రాష్ట్రాల్లో పోటీకి సన్నద్ధమయ్యారు.

అప్పటికి ఆయన అజేయశక్తిగానే కనిపించారు. బీఆర్‌ఎస్ పేరిట మహారాష్ట్రలో ఎన్నికల సభలు, సమావేశాలు నిర్వహించడం.. హైదరాబాద్‌లోని మహారాష్ట్రకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరపడం  రాష్ట్ర ప్రజలకు అప్పుడు కొంత వింతగానే అనిపించింది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మూడునెలలు కేసీఆర్‌కు కలసి రాలేదు. ప్రధానంగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆ విషయాన్ని గుర్తించకుండా వారికే తిరిగి టిక్కెట్లు ఇచ్చారు.

నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, జీతాలు సరిగా రాక ఉద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపారు. ఇటు ఎన్నికలకు కొన్ని వారాల ముందే తాను గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ తమ అస్త్రంగా వాడుకున్నది. మేడిగడ్డ బరాజ్ వద్దకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి వెళ్లి ఆ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

పోలింగ్‌కు కొన్ని గంటల ముందే రైతుబంధు నగదు పంపిణీని ఈసీ నిలిపివేసింది. ఇలా కేసీఆర్‌కు ఎన్నికల ముందు ఎదురుదెబ్బలు తగలడంతో అప్పు డు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి కలిసివచ్చింది. ప్రతికూల పరిస్థితులను దాటుకొని ఎన్నికల్లో  ఆయన ప్రజల్లోకి దూకుడుగా వెళ్లారు.

అప్పుడు కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులకన్నా కేసీఆర్ తప్పిదాలే లాభం చేకూ ర్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ తన వైపుకు తిప్పుకున్నది. దీనితో పాటు వామపక్షాల్లో ప్రధానమైన సీపీఐ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. దీనితో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 

ఆరు గ్యారెంటీలు.. రైతుబంధు స్థానంలో ఎకరానికి రూ.7500 రైతు భరోసా, మహిళలకు నెలనెల రూ.2500 ఇవ్వడం, 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ పంట రుణమాఫీ వంటి పథకాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నెలల వరకు ప్రజాదరణ చెక్కు చెదరలేదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆర్నెల్లల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పూర్తిగా చతికిల పడగా కాంగ్రెస్ 8 ఎంపీ సీ ట్లు సాధించింది.

ఇప్పటివరకు కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉన్నా క్రమంగా బీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీపై గులా బీ పార్టీ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించింది. కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకువచ్చి చెరువులు, కుంటలు, వాగులు పక్కన ఉన్నా నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది.

మొదట ప్రభుత్వంపై ఓ వర్గంలో సానుకూలమైన స్పందన వచ్చినా, హైడ్రా నిబంధనల ప్రకారం నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో పేదల బస్తీలు ఉండటంతో ఆ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వచ్చిన ఆ వ్యతిరేకతను బీఆర్‌ఎస్ పార్టీ తనవైపుగా తిప్పుకు న్నది.

ఇటు రుణమాఫీ సరిగా చేయలేదన్న ప్రచారం, దసరాకు బతుకమ్మ చీరలు పంపి ణీ చేయకపోవడం, సకాలంలో రైతుభరోసా డబ్బులు వేయలేకపోవడం కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోవడానికి కారణమయ్యా యి. పాలనలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న ప్రచారం ఊపందుకున్నది. బీఆ ర్‌ఎస్ పుంజుకున్నదని, ఆ సమయంలో అ సెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 75 సీ ట్లకు తగ్గకుండా వస్తాయని, మళ్లీ కారు పార్టీ దే అధికారం అన్న విశ్లేషణలు వచ్చాయి. 

అయితే రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న సామెత ఉం డనే ఉంది. అంతా బీఆర్‌ఎస్‌దే అనుకుంటున్న సమయంలో తెలంగాణ రాజకీయా ల్లో కలకలం మొదలైంది. దానికి కేంద్ర బిందువు బీఆర్‌ఎస్ పార్టీనే కావడం విశేషం. పార్టీ 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.

ఈ సభ ద్వారా కేసీఆర్‌ను మళ్లీ ప్రజల్లో తీసుకువచ్చి పార్టీని ట్రాక్ ఎక్కించాలని భావించింది. దానికోసం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిని సభా నిర్వహణ ప్రాంతంగా ఎంచుకున్నారు. దా దాపు వందకోట్లు ఖర్చు చేసి లక్షల్లో భారీగా జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని కారు పార్టీ పెద్దలు భావించారు. ఎల్కతుర్తి సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

కానీ, కేసీఆర్ ప్రసంగంపై రాజకీయ వర్గాలు పెదవి విరిచారు. ఆయన ప్రసంగాన్ని  గత ప్రసంగాలతో పోలిస్తే, అంత పవ ర్ లేదన్న విమర్శలు వచ్చాయి. దానికి తోడు గతంలో బహిరంగ సభల్లో దారాళంగా ఉపన్యసిస్తూ, ప్రత్యర్ధి పార్టీలపై పంచులతో విరుచుకుపడే కేసీఆర్ ప్రసంగాన్ని రాసుకొని వచ్చి చదివారన్న విమర్శలు వచ్చాయి. దీని కి అంత భారీ వ్యయంతో సభలు నిర్వహించడం ఎందుకని, టీవీలు ఇతర ప్రసార మాద్యమాల్లో ఆ ప్రసంగాన్ని చదివితే సరిపోయేది కాదా అనే కామెంట్లు రాజకీ యవ ర్గాల నుంచి వచ్చాయి.

దానికి తోడు ఆ సభ, కేసీఆర్ ప్రసంగం కేంద్రంగా కేసీఆర్ కూతు రు ఎమ్మెల్సీ కవిత ఆయనకు రాసిన లేఖ వెలుగుచూడటం కలకలం రేపింది. ఆ తర్వా త కవిత ఒకడుగు ముందుకువేసి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారిని తొలిగిస్తేనే పార్టీ బాగుపడుతుందన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.

ఈ అంశం తో కేసీఆర్ కుటుంబంలో విభేదాలు వెలుగులోకి వచ్చినట్లుంది. దీనితో బీఆర్‌ఎస్ గ్రాఫ్ కాస్త తగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రైతుభరోసా లాం టి పాపులర్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసివుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అందనంత ఎత్తున ఉండగలిగేది. 

అసెంబ్లీ ఎన్నికలు, వెనువెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన బీజే పీ, ఆ తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను క్షుణ్ణంగా గమనిస్తున్నది. బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ బలహీన పరుస్తున్నదని కమలనాధులు గుర్తించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ముస లం పుట్టించి ఆ పార్టీని బలహీనపర్చడంలో కాంగ్రెస్ హస్తముందని భావిస్తున్నారు.

ప్ర స్తుతం బీఆర్‌ఎస్‌లో నెలకొన్న కుటుంబ రాజకీయాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ పరి ణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే పరిస్థితులు ఉండొచ్చు. ఇక బీజేపీ కూడా తమ రాజకీయ వ్యూహాలకు పదనుపెడుతోంది. రాబోయే ఆర్నెల్ల లోపు కొత్త అధ్యక్షు డిని పార్టీ నియమించబోతోంది.

అప్పుడు రాష్ట్ర రాజకీయ రంగంపై కమలం పార్టీ ఊ పు కనిపించవచ్చు. రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ప్రధానమ్రంతి మోదీ, హిందూత్వ, దేశంలో బీసీల సంఖ్యను పెం చేందుకు జనగణనలో కులగణన చేపట్టే అం శం అభివృద్ధి, ఆపరేషన్ సిందూర్‌తో సాధించిన విజయం ఆ పార్టీకి కలిసివచ్చేవిగా ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ, పవన్ కల్యాన్‌ల మద్దతును కూడా తెలంగాణలో రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాధులు ఉపయోగించుకోవచ్చు. తెరవెనుకనుంచి కొంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతును కూడా బీజేపీ కూడగట్టవచ్చు. మొత్తానికి రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు అవకాశాలున్నాయి.

ఏ పార్టీకీ ఆ పార్టీ తన వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులను చూస్తూనే ఉంటాం. అట్లాగే తెలంగాణలో పొలిటికల్ స్టాక్ మార్కెట్‌లో ఏ పార్టీ బుల్‌మార్కెట్‌గా పైకి లేస్తుంది, ఏ పార్టీ బేర్ మార్కెట్‌లా పడిపోతుందో అన్నది ఆసక్తిగా మారనున్నది. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి