13-06-2025 12:25:49 AM
ఎల్లారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రజలకు ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ప్రజలకు నాణ్యమైన ఇల్లును అందించే విధంగా పంచాయతీ కార్యదర్శి, సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్ అన్నారు.
గురువారం ఎల్లారెడ్డి మండలంలోని మీసంపల్లి గ్రామంలో నిర్మాణమైతున్న ఇందిరమ్మ ఇల్లు ఎంపీడీవో ప్రకాష్ నేరుగా పరిశీలించారు. అనంతరం నిర్మాణం పట్ల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నేడు పాఠశాలలో ప్రారంభం అయినందున గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల తీరును పరిశీలించి హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.