11-06-2025 01:09:17 AM
- సన్న బియ్యం పంపిణీతో పేదింట పండుగ
- రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ములుగు ప్రతినిధి, జూన్10( విజయక్రాంతి): ములుగు జిల్లాలో రైతాంగం ఎక్కువగా సన్న వడ్లను సాగు చేస్తున్న తరుణంలో జిల్లాలో పండించిన వరి ధాన్యాన్ని ఇక్కడి ప్రాంత ప్రజలకు బియ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలో ఎక్కడ పంపిణీ చేయని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని నిరుపేదలకు ఈ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి ప్రారంభం కావడంతో జిల్లాలో సన్న బియ్యం తీసుకుంటున్న ప్రతి నిరుపేద కుటుంబాలలో సంబరాలు నెలకొన్నాయి. 1982 సంవత్సరంలో అప్పటి పాలకులు ఒక్క రూపాయికి కిలో దొడ్డు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఆ సమయంలో సంబరాల్లో మునిగిన ప్రజలు అదే తరహాలో నేడు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా కాదు నిరుపేదలు మాత్రమే ఆహారంగా తీసుకున్నారే తప్ప 80 శాతం ప్రజలు వాటిని ఇతరులకు అమ్మకం చేయడంతో దొడ్డు బియ్యం పథకం పక్కదారి పట్టింది. దీంతో రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుని ప్రతి నిరుపేద వ్యక్తి ధనవంతుడు తింటున్న విధంగానే కడుపు నిండా ఆహారం తీసుకోవాలని ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడమే కాకుండా సన్న వడ్లను రైతులు పండించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించి సన్న వడ్లను పండించిన ప్రతి రైతుకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలకు సరిపడా బియ్యం ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగించనున్నారు. మూడు నెలల బియ్యాన్ని తీసుకున్న ప్రతి నిరుపేద కుటుంబం ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలో అధిక మొత్తంలో రైతులు వారి ధాన్యాన్ని సాగు చేస్తుండగా ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో ప్రతి రైతు సన్న వడ్లను పండించడానికే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పండిస్తున్న సన్న వడ్లను ఇక్కడి జిల్లా ప్రజలకు బియ్యం రూపంలో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది.
జిల్లాలోని 10 మండలాల్లో 94,628 తెల్ల రేషన్ కార్డులు కలిగిన నిరుపేదలు ఉండగా ప్రతి నెల వారికి 17 వేల 19 కన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నడంతో ఐదు వేల 150 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ షాపులకు సరఫరా చేసింది. దీంతో ఒకవైపు రైతులు మరోవైపు నిరుపేదల కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెల్లువిరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రుణపడి ఉంటామని పేదలు అంటున్నారు.
కడుపునిండా తిండి కంటి నిండా నిద్ర పోతున్నాం.
లబ్ధిదారి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంతో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాడంతో ప్రతిరోజు కడుపునిండా తిండి తినడమే కాకుండా కంటి నిండా నిద్రపోతున్నామని జిల్లాలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వలన తిండి తినలేకపోయామని,నేడు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో కష్టపడి పని చేస్తూ ఇష్టంతో సన్న బియ్యంతో భోజనం చేస్తున్నామని అన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమని వారు హర్షం వ్యక్తం చేశారు.