15-06-2025 06:59:12 PM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్..
మునగాల: కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్(BC Students Union National General Secretary Pachipala Ramakrishna Yadav) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భంగా ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు కట్టలేక పేద వారందరూ ఆర్థికంగా చిదిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నమెంట్ బడిలో బోధన నాణ్యంగా లేకపోవడం వలన ప్రజలు కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ పై ఆధారపడుతున్నారని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పందించి ఫీజులపై ఆర్డినెన్స్ చట్టం తీసుకువచ్చి పుస్తకాలను కూడా స్కూళ్లల్లో విక్రయించకుండా బయట కొనుక్కునే విధంగా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ కల్పించాలని, అలాగే ఫీజులను బహిర్గతంగా డిస్ప్లే చేయాలని ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలపై ఉక్కు పాదం మోపాలని... ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగి వరకు వాళ్ల పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేలాగా మొత్తం తీసుకురావాలని అప్పుడే ప్రభుత్వ విద్య వ్యవస్థ బాగుపడుతుందని ఆయన అన్నారు.
ఎంతోమంది కార్పొరేట్ ప్రైవేట్ బడులలో ఫీజులు కట్టలేక ఆర్థికంగా చెదిగిపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ కార్పొరేట్ బడులకు వెళ్లకుండా ఉంటే వాళ్లే దిగి వస్తారని అప్పుడు ఫీజులు తగ్గుతాయని అన్నారు ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులవి రాజకీయ నాయకులవి చాలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని వాటిపై సిబిఐ ఎంక్వయిరీ వేసి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.