04-06-2025 04:42:30 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎంపీగా ఎన్నికై ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(MP Porika Balram Naik)ను కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా సత్కరించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఓబీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్, పీసీసీ సభ్యుడు గుగులోతు దసురు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, మాజీ జెడ్పిటిసి హెచ్.వెంకటేశ్వర్లు, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, బండారు దయాకర్, అమరేందర్ రెడ్డి, సీతారాంరెడ్డి, నునావత్ రమేష్ నాయక్, రాము గౌడ్, చిదురాల వసంతరావు, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, గుగులోత్ వంశీ నాయక్, షేక్ రియాజ్ అన్సారి, మాలోత్ అరుణ్ నాయక్, భరత్ తదితరులు పాల్గొన్నారు.