30-06-2025 01:39:22 AM
చిగురుమామిడి, జూన్ 29 (విజయక్రాంతి): మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1988- 89 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీ య సమ్మేళన కార్యక్రమం పాఠశాల ఆవరణలో నిర్వహించారు.
చాలా సంవత్సరాల త ర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను ఆహ్వానించి వారికి శాలువా జ్ఞాపకలతో సత్కరించారు. అనంతరం సహ పంక్తి భోజనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలోపాల్గొన్నారు.