30-06-2025 01:40:41 AM
కరీంనగర్, జూన్ 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీకి ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శులుగా నియామకమైన వారిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా నియమించారు.
కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి వరంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని ఇంచా ర్జీగా నియమించారు. ఆయన కింద టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అదాం రాజ్ దేకపతిలను ఇంచార్జిలుగా నియమించారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ను నియమించారు.
ఆయన కింద ప్రధాన కార్యదర్శులు మల్లాది రాంరెడ్డి, రాజేశ్ కాశిపాక, రహ్మత్ హుస్సేన్లను నియమించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీగా నాయిని రాజేందర్ రెడ్డిని నియమించడం పట్ల సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంతోపాటు రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలుతెలిపారు.