04-06-2025 11:31:22 PM
చర్ల (విజయక్రాంతి): మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 20 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులు బుధవారం సమావేశమయ్యారు. తోటి స్నేహితులతో కేరింతలు నాటి జ్ఞాపకాలు నెమర వేసుకుంటూ నాడు పాఠాలు బోధించిన శ్రీధర్, గంటా సత్యనారాయణ, మర్లా ప్రసాద్ గురువులను గౌరవ వందనంతో పాటు శాలువాతో సన్మానించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడో దూరంగా ఉంటున్న నాటి మిత్రులంతా ఈ అపూర్వ కలయికకు వీలు చేసుకొని అందరూ కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని సురేష్ మనోభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ సతీష్, చింతల శీను, లక్ష్మణచారి, శంకరాచారి, కొట్ర సంపత్, ముత్యాల సతీష్, చల్ల పవన్, తదితరులు పాల్గొన్నారు.