05-06-2025 12:00:00 AM
మంత్రుల రాకతో భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి
హుస్నాబాద్, జూన్ 4 : ఈ నెల 6, 7, 8 తేదీలలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరగనున్న కిసాన్ మేళాకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ మేళాకు మంత్రులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర మహేశ్ మేళా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, ‘కిసాన్ మేళా సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మేళాకు వచ్చే రైతులు ప్రజలు పోలీసుల సలహాలు, సూచనలను తప్పకుండా పాటించాలి‘ అని విజ్ఞప్తి చేశారు.
అధికారులు ముఖ్యంగా వీఐపీల రాకపోకలు, రైతులు కూర్చునే గ్యాలరీ ప్రదేశాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను నిశితంగా పరిశీలించారు. సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర మహేశ్ కు ఏసీపీ సదానందం పలు కీలక సూచనలు చేశారు.
కార్యక్రమం సజావుగా సాగేందుకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కిసాన్ మేళా విజయవంతానికి, హాజరయ్యే వారందరి భద్రతకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.