01-06-2025 05:44:42 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నివాసి అందే వీరస్వామి సింగరేణి కోల్ మైన్ లేబర్ యూనియన్(Singareni Coal Mines Labour Union) సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని వీరస్వామి కి అందజేశారు. ఐఎన్టీయూసీ యూనియన్ లో కేంద్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకు గాను అందె వీరస్వామి జనక్ ప్రసాద్ కీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన కీలక బాధ్యతల్ని తాను నెరవేరుస్తూ యూనియన్ బలోపేతానికి పాటుపడతానని అందె వీరస్వామి తెలిపారు.