17 April, 2026 | 2:29 AM

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

17-04-2026 12:38 AM

కౌన్సిలర్ మలగం రమేష్ 

మిర్యాలగూడ, ఏప్రిల్ 16  :గర్భిణీలు బాలింతలు ఆరుఏండ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టిక ఆహారంతో పాటు ప్రీ స్కూల్ విద్య సద్వినియోగం చేసుకోవాలని 44వ వార్డు కౌన్సిలర్ మలగం రమేష్ కోరారు. గురువారం సీతారాంపురం అంగన్వాడీలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడలో భాగంగా ఎర్లీ చైల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అంగన్వాడీల్లో అందించే చిరుధాన్యాలు, మిల్లెట్స్, పాలపదార్థలు  తీసుకోవడం ద్వారా పోషకవిలువలు పెంపొందించు కోవాలన్నారు. పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు అవసరం ఆయిన టీకాలతో పాటు ఆటపాటల నడుమ సృజనాత్మకతతో కూడిన కార్నర్స్ ఉపయోగిస్తూ పిల్లలకు జరిపే  బోధనలు వారి మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చిలిపి రెడ్డి  పద్మ, అంగన్వా టీచర్లు రమాదేవి, మీనాక్షి,  విజయ, మేరాజ్ సుల్తానా, షాహిన్,  మల్లీశ్వరి ఏఎన్‌ఎం  శోభారాణి తదితరులు పాల్గొన్నారు.