07-02-2026 12:46:49 AM
శ్రీరంగాపురం ఫిబ్రవరి 6: మండల కేంద్రంలోని అంగన్వాడి 3వ కేంద్రంలో చి న్నారుల పోషకాహారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా అన్న ప్రసన్న కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ మంజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భి ణీ స్త్రీలు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పోషక విలువలు కలిగిన భోజనాన్ని అందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మంజుల రాణి మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పొందారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల అంగన్వాడి కేంద్రాల పాత్ర కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.