30 July, 2026 | 5:48 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

బుగ్గ రాజరాజేశ్వరునికి ఘనంగా అన్నపూజ

27-10-2025 10:55 PM

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వరునికి మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ఘనంగా అన్న పూజ నిర్వహించారు. దేవస్థాన అర్చకులు సతీష్ శర్మ వేదమంత్రోచరణ మధ్య గర్భగుడిలోని శివలింగానికి అన్న సమర్పణ చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు కన్నుల నిండుగా దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద మహిళలు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి భజన బృందం సహాయక సంఘం సభ్యులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులకు మందమర్రికి చెందిన మిడివెళ్లి రాజశేఖర్ మాధురి దంపతులు అన్నదానం నిర్వహించారు.