01-10-2025 12:00:00 AM
ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): అమ్మ వారి నవరాత్రి ఉత్సవలలో భాగంగా స్థానిక 51 డివిజన్ లో 24 గంటల పంపు నవ దుర్గ ఉత్సవ కమిటీ, బుర్హనపురం శ్రీ భవాని ఉత్సవ కమిటీ ల వద్ద మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్న దాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 51 వ డివిజన్ కార్పొరేటర్ శీలంశెట్టి రమవీరభద్రం, 50 వ డివిజన్ కార్పొ రేటర్ రాపర్తి శరత్ పాల్గొని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారి అన్నప్రసదా న్ని స్వీకరించటం జరిగింది..ఈ కార్యక్రమంలో పరమేష్, తీగల మల్లికార్జున్, మేకల భార్గవ్, రాపర్తి బన్ను,సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.