03-07-2025 12:10:39 AM
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానసశర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానసశర్మ అందించగా.. స్క్రీన్ప్లే, డైలాగ్స్ను మానసశర్మ, మహేశ్ ఉప్పాల అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నాగ్అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఫాంటసీ, కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు అనుదీప్దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్అలీ ఎడిటర్గా పనిచేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రాఫర్ గా, పుల్లా విష్ణువర్ధన్ ప్రొడక్షన్ డిజైనర్గా, విజయ్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.