03-07-2025 12:13:19 AM
నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘తమ్ముడు’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా శ్రీరామ్వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- మనమంతా కొత్త సినిమా కావాలనుకుం టాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్ని స్తా అన్నాడు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం. స్క్రీన్ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్తో తెరకెక్కించారు. అక్కా తమ్ముడి మధ్య సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారనేదే కథ. మొదటి 20 నిమిషాల తర్వాత మిగతా కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే చేశాం కాబట్టి అంగీకరిం చాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80% మూవీ అడవిలో ఉంటుంది. అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు.
- ‘తమ్ముడు’ సినిమా ప్రీమియర్స్ విష యం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్డీసీ ఛైర్మన్గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. ‘తమ్ముడు’ను నెట్ఫ్లిక్స్ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు.
- పైరసీ అయినా, నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది నిర్మాతకే. నేను వీటిపై గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చిం ది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశా వ్.. ఆయన రేంజ్కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్గా చూడొద్దు.
- ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే ‘దిల్ రాజు డ్రీమ్స్’ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటి అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం.
- ఎఫ్డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిం చాలనుకుంటున్నాం. ఆన్లైన్ టికెటింగ్, రన్ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగు తోంది.
- ప్రస్తుతం మా సంస్థలో ‘రౌడీ జనార్థన’, ‘ఎల్లమ్మ’, ‘దేత్తడి’ ప్రొడక్షన్లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. ‘యానిమల్’లాగా ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా ‘దిల్ రాజు డ్రీమ్స్’లో రెండు మూడు చిత్రాలు లైనప్లో ఉన్నాయి.
- ఫలానా ఓటీటీ సినిమాను తీసుకుందని ముందే ప్రకటించడం ఆపేస్తే మంచిది. ఓటీటీలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. తమ్ము డు మూవీ కంటెంట్కు వస్తున్న వ్యూస్ విషయంలో జెన్యూన్గా ఉంటున్నాం.
- పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. థియేటర్లలో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈమధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాల ర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్లు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టమవుతాయని ఆశిస్తున్నాం.